సరే ఇక అసలు విషయానికి వస్తే మీలో చాలా మంది రక రకాల వార్తా పత్రికలలో ఈ వార్త చూసే ఉంటారు మొన్న డిశంబర్ 1-2 తారీఖులలో ఆకాశం లో ఈ చిత్రం ఆవిష్కరింప బడింది. దీని వెనుక కధ ఏంటంటే జ్యూపిటర్ మరియూ వీనస్ గ్రహాలు రెండూ ఒకే సరళ రేఖలో భూమికి కాస్త దగ్గరగా రావడం వారిద్దరికీ మన చందమామ కూడ తోడవడం తో అదీ ఓ చక్కని చిక్కని చీకటి పరచుకున్న రాత్రి వేళ జరగడం తో ఎటువంటి పరికరం సాయం లేకుండా సాధారణమైన కంటి తో చూసేలా నీలి నింగి లో ఈ అందమైన దృశ్యం ఆవిష్కరించబడింది. దీన్ని ఓ ఔత్సాహికుడు తన కెమేరా కంటి తో బంధించి ఆ ఫోటోలు నాతో పంచుకుంటే నేను నా బ్లాగ్ లో పెట్టి మీ అందరితో పంచుకుంటున్నా అనమాట. అదీ సంగతి.


మూడూ గ్రహాల మధ్య అనంతమైన దూరమున్నా అన్నీ కలిసి ఇలా చక్కని స్మైలీ గా ఫార్మ్ అవడం చూడ చక్కగా లేదు. టైంస్ ఆఫ్ ఇండియా న్యూస్ ఆర్టికిల్ ప్రకారం మళ్ళీ మే 11, 2011 లో ఓ పగటి పూట ఇలా జరుగుతుంది కాకపోతే పగలు కనుక ఇలా సాధారణ కంటికి కనిపించదు. తరువాత మళ్ళీ ఈ అద్భుతం నవంబర్ 18, 2052 లో రాత్రి పూట ఆవిష్కృతమవుతుందట కనుక మిస్ అయిన వారు, నాలా చికాగో లాంటి చలి ప్రదేశం లో ఉంటూ చూడలేని వారు ఓ సారి సరదాగా లుక్కేస్కోండి. హ్మ్!! ఇక్కడ ప్రస్తుతం ఉన్న వింటర్ వాతావరణాం వల్ల ఒక అరమైలు ముందున్న కారే కనపడటం లేదు ఇంక ఆకాశం లో ఏంకనపడుతుంది నా మోహం !!




.jpg)


